'డియర్ కామ్రేడ్' కు తప్పిన పెను ప్రమాదం
- December 17, 2018వరుస అవకాశాలతో దూసుకుపోతోన్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల లడక్లో షెడ్యూల్ పూర్తి కావడంతో కాకినాడలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్దేవరకొండకు జోడీగా రష్మికా మండన్నా నటిస్తోంది. కాగా కాకినాడలో జరుగుతున్న షూటింగ్లో విజయ్దేవరకొండ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షూటింగ్లో భాగంగా కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి విజయ్ పట్టుతప్పి కిందపడిపోబోయారు. అనంతరం తిరిగి పట్టుచిక్కి ట్రైన్ ఎక్కారు. ఈ ఘటనలో విజయ్కి చిన్న గాయమే అయినా, ఒకవేళ పట్టుతప్పి పడిపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని తెలుస్తోంది. చిత్ర షూటింగ్ జరుగుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, షూటింగ్లో గాయపడిన విజయ్ జీవితంలో ఏదీ ఊరికే రాదు.. గాయాలతో కూడా పండగ చేసుకోవాలి అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఫొటో పెట్టారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు