రోడ్డుపై పడ్డ డబ్బు..క్షణాల్లో మాయం
- December 17, 2018న్యూజెర్సీ: నగర ప్రాంత నడి రోడ్డుపై ఈ రోజు ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. భారీ నగదుతో వెళుతున్న ఓ ట్రక్ లో నుంచి డబ్బులు రోడ్డుపై పడిపోయాయి. దీంతో వొక్కసారిగా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. వాహనదారులు తమ కార్లను పక్కకు ఆపి రోడ్డుపై పడ్డ డబ్బులను ఏరుకునేందుకు పోటీ పడ్డారు. అక్షరాలా.. రూ. 2.15 కోట్లు క్షణాల్లో మాయమైపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రక్ తలుపులు సరిగా బిగించకపోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు.
దారిలో వొక తలుపు తెరుచుకుని డబ్బు రోడ్డుపై పడిపోయాయని తెలిపారు. డబ్బును తీసుకున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా