'మీ టూ' కు మోడీ భయపడ్డారా?

- December 20, 2018 , by Maagulf
'మీ టూ' కు మోడీ భయపడ్డారా?

ప్రధాని నరేంద్ర మోడీని బాలీవుడ్ ప్రముఖులు ముంబై రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సాధించిన ప్రగతి, పలు అంశాల గురించి విస్తృతంగా చర్చించామని మోడీ తెలిపారు. బాలీవుడ్‌ నిర్మాతలు రితేష్‌ సిద్వానీ, కరణ్‌ జోహార్‌, సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌, రాకేష్‌ రోషన్‌, రోనీ స్క్రూవాలా, ప్రసూన్‌ జోషి తదితరులు ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా.' చిత్ర పరిశ్రమ ప్రముఖులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. సినీ రంగంలో జీఎస్టీ అమలు విధివిధానాలపై వారి విలువైన సలహాలు ఇచ్చారు' అంటూ సినీ ప్రముఖులతో దిగిన ఫొటోను మోదీ ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రధాని ట్వీట్‌పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ' సినీ రంగంలో కావాల్సినంత మంది మహిళలు ఉన్నారు. కానీ ప్రధానిని కలిసిన బృందంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం చాలా బాగుంది' అంటూ ఓ మహిళ వ్యంగ్యంగా ట్వీట్‌ చేయగా. 'భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు పుట్టించినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సినీ రంగంలో ఉన్న మహిళలు ప్రధానిని కలవడానికి అర్హులు కారేమో' అంటూ మరొకరు మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com