'మీ టూ' కు మోడీ భయపడ్డారా?
- December 20, 2018ప్రధాని నరేంద్ర మోడీని బాలీవుడ్ ప్రముఖులు ముంబై రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సాధించిన ప్రగతి, పలు అంశాల గురించి విస్తృతంగా చర్చించామని మోడీ తెలిపారు. బాలీవుడ్ నిర్మాతలు రితేష్ సిద్వానీ, కరణ్ జోహార్, సిద్దార్థ్ రాయ్ కపూర్, రాకేష్ రోషన్, రోనీ స్క్రూవాలా, ప్రసూన్ జోషి తదితరులు ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా.' చిత్ర పరిశ్రమ ప్రముఖులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. సినీ రంగంలో జీఎస్టీ అమలు విధివిధానాలపై వారి విలువైన సలహాలు ఇచ్చారు' అంటూ సినీ ప్రముఖులతో దిగిన ఫొటోను మోదీ ట్వీటర్లో పోస్ట్ చేశారు. ప్రధాని ట్వీట్పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ' సినీ రంగంలో కావాల్సినంత మంది మహిళలు ఉన్నారు. కానీ ప్రధానిని కలిసిన బృందంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం చాలా బాగుంది' అంటూ ఓ మహిళ వ్యంగ్యంగా ట్వీట్ చేయగా. 'భారత్లో మీటూ ఉద్యమం ప్రకంపనలు పుట్టించినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సినీ రంగంలో ఉన్న మహిళలు ప్రధానిని కలవడానికి అర్హులు కారేమో' అంటూ మరొకరు మండిపడ్డారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు