ప్రముఖ దర్శకుడి కన్నుమూత
- December 30, 2018కోల్కతా: ఇండియన్ సినిమా చూసిన అత్యున్నత దర్శకుల్లో ఒకరైన బెంగాలీ డైరెక్టర్ మృనాల్ సేన్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఉదయం పదిన్నర గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. మృనాల్ సేన్ వయసు 95 ఏళ్లు. మృనాల్ సేన్కు 2005లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఫరీద్పూర్లో మృనాల్ జన్మించారు. 1956లో రాత్ భోర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆకాశ్ కుసుమ్ (1965), భువన్ షోమ్ (1969), కలకత్తా 71, ఇంటర్వ్యూ (1971), ఖాందహార్ (1974), కోరస్ (1975), మృగయ (1977), అకలేర్ సాంధనె (1981), ఏక్ దిన్ అచానక్ (1989)లాంటి సినిమాలను ఆయన తెరకెక్కించారు. 2002లో వచ్చిన ఆమర్ భువన్ మృనాల్ సేన్ చివరి సినిమా.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు