12 గంటల పాటు మూసుకున్న జగన్నాథ ఆలయం

- December 30, 2018 , by Maagulf
12 గంటల పాటు మూసుకున్న జగన్నాథ ఆలయం

ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పూజారులు ఆందోళనకు దిగారు. విధుల్లో ఉన్న పోలీసు పూజారిపై దాడి చేశాడని ఆరోపిస్తూ, ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేశారు. ఆలయ పూజారి తన వెంట ఓ భక్తుడిని గర్భాలయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ భక్తుడు విదేశీయుడని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భావించాడు. ఈ విషయంపై పోలీసు, పూజారి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసు తనపై దాడికి దిగాడని ఆరోపించడంతో మిగతా పూజారులు విధులు బహిష్కరించి, గర్బాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జేపీ దాస్ హామీ ఇవ్వడంతో పూజారులు తమ ఆందోళనను విరమించారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగి జగన్నాథ ఆలయం రోజు ఉదయం 5గంటలకు తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com