12 గంటల పాటు మూసుకున్న జగన్నాథ ఆలయం
- December 30, 2018
ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పూజారులు ఆందోళనకు దిగారు. విధుల్లో ఉన్న పోలీసు పూజారిపై దాడి చేశాడని ఆరోపిస్తూ, ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేశారు. ఆలయ పూజారి తన వెంట ఓ భక్తుడిని గర్భాలయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ భక్తుడు విదేశీయుడని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భావించాడు. ఈ విషయంపై పోలీసు, పూజారి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసు తనపై దాడికి దిగాడని ఆరోపించడంతో మిగతా పూజారులు విధులు బహిష్కరించి, గర్బాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జేపీ దాస్ హామీ ఇవ్వడంతో పూజారులు తమ ఆందోళనను విరమించారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగి జగన్నాథ ఆలయం రోజు ఉదయం 5గంటలకు తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







