12 గంటల పాటు మూసుకున్న జగన్నాథ ఆలయం
- December 30, 2018
ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పూజారులు ఆందోళనకు దిగారు. విధుల్లో ఉన్న పోలీసు పూజారిపై దాడి చేశాడని ఆరోపిస్తూ, ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేశారు. ఆలయ పూజారి తన వెంట ఓ భక్తుడిని గర్భాలయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ భక్తుడు విదేశీయుడని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భావించాడు. ఈ విషయంపై పోలీసు, పూజారి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసు తనపై దాడికి దిగాడని ఆరోపించడంతో మిగతా పూజారులు విధులు బహిష్కరించి, గర్బాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జేపీ దాస్ హామీ ఇవ్వడంతో పూజారులు తమ ఆందోళనను విరమించారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగి జగన్నాథ ఆలయం రోజు ఉదయం 5గంటలకు తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







