12 గంటల పాటు మూసుకున్న జగన్నాథ ఆలయం
- December 30, 2018ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పూజారులు ఆందోళనకు దిగారు. విధుల్లో ఉన్న పోలీసు పూజారిపై దాడి చేశాడని ఆరోపిస్తూ, ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేశారు. ఆలయ పూజారి తన వెంట ఓ భక్తుడిని గర్భాలయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ భక్తుడు విదేశీయుడని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భావించాడు. ఈ విషయంపై పోలీసు, పూజారి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసు తనపై దాడికి దిగాడని ఆరోపించడంతో మిగతా పూజారులు విధులు బహిష్కరించి, గర్బాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జేపీ దాస్ హామీ ఇవ్వడంతో పూజారులు తమ ఆందోళనను విరమించారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగి జగన్నాథ ఆలయం రోజు ఉదయం 5గంటలకు తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్