మరో ఘనత సాధించిన అంగవైకల్య మహిళ
- January 05, 2019న్యూఢిల్లీ: 2013లో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సృష్టించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత అరునిమ సిన్హా.. మరో ఘనత సాధించింది. అంటార్కిటికాలో అత్యంత ఎత్తైన శిఖరం విన్సన్ను అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సాధించింది.''నిరీక్షణ అంతమైంది. సరికొత్త ప్రపంచ రికార్డును మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. విన్సన్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సృష్టించాను. మీ అందరి ప్రార్థనలకు, ఆశీస్సులకు కృతజ్ఞతలు'' అని అరునిమ ట్విట్టర్లో రాసుకొచ్చింది.కాగా అరునిమకు ప్రధాన మంత్రి మోడీ అభినంధనలు తెలిపారు. ''సరికొత్త ఘనత సాధించిన అరునిమ సిన్హాకు అభినంధనలు. ఆమె ఇండియాకు గర్వకారణం. తన పట్టుదల, కృషితో ఈ విజయాన్ని సాధించింది. అరునిమకు మంచి భవిష్యత్ ఉంది'' అని ట్విట్టర్లో మోడీ రాసుకొచ్చారు. అంతే కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో పాటు పలువురు ప్రముఖులు అరునిమను అభినందించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం