ఐర్లాండ్:సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన భారతీయ విద్యార్థి
- January 05, 2019ఐర్లాండ్:ఎత్తైన కొండ మీద నుంచి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఐర్లాండ్లోని క్లిఫ్స్ ఆఫ్ మోహర్ కొండ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన విద్యార్థి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. డబ్లిన్ యూనివర్సిటీలో సదరు యువకుడు విద్యనభ్యసిస్తోన్నట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా క్లిఫ్స్ ఆఫ్ మోహర్ నిలిచింది. ఎత్తైన కొండలు, పచ్చిక బయళ్లు, ఆహ్లాదకర వాతావరణ, పక్కనే సముద్రంతో అత్యంత సుందరమైన ప్రదేశంగా పేరుగాంచింది. ప్రకృతి సోయగాలను వీక్షించేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థి కొండ అంచున నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కాలు పట్టుతప్పడంతో కొండమీద నుంచి జారిపడి సముద్రంలో పడిపోయాడు.
విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. హెలికాప్టర్ సహాయంతో సముద్రంలో పడిపోయిన విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. చనిపోయిన విద్యార్థికి సుమారు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడి వివరాలను తెలుసుకొని కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం