ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం
- January 06, 2019కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర బదాఖ్షాన్ ప్రావిన్స్లోని ఓ బంగారం గని కూలడంతో 30 మంది కార్మికులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్లంతా గనిలో పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 20 మంది వరకు గాయపడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇలా గనులు కూలడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. స్థానిక గ్రామస్థులు బంగారం కోసమని నదీ తీరంలో 60 మీటర్ల లోతు వరకు గని తవ్వారు. అందులోకి వెళ్లి బంగారం కోసం అన్వేషిస్తుండగా గని కూలింది. ఈ గనిని తవ్విన వాళ్లు ప్రొఫెషనల్స్ కాకపోవడం వల్ల అది కూలి ఉంటుందని ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి నిక్ మొహ్మద్ నజారీ చెప్పారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇక్కడి గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్రమంగా గనులు తవ్వి బంగారం కోసం అన్వేషిస్తున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం