నిమ్మకూరు వెళ్లనున్న బాలకృష్ణ,విద్యాబాలన్
- January 06, 2019
దివంగత నటుడు ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో నందమూరి బాలకృష్ణ ..నటి విద్యాబాలన్తో కలిసి రేపు పర్యటించనున్నాడు. ఈ మేరకు నిమ్మకూరులో ఏర్పాట్లు చేస్తున్నట్టు బాలకృష్ణ మిత్రుడు బుర్రా గాంధీ మీడియాకు తెలిపారు. బాలకృష్ణ, విద్యాబాలన్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా రానున్నారని చెప్పారు. అక్కడ ముందుగా ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేశాక, 'ఎన్టీఆర్' రెండో భాగానికి సంబంధించిన ఓ సీన్ ను గ్రామంలో చిత్రీకరించనున్నారని చెప్పారు. హరికృష్ణగా నటిస్తున్న కల్యాణ్ రామ్ కూడా షూటింగ్ లో ఉంటారని చెప్పారు. రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని, ఆపై రోడ్డు మార్గంలో 10 గంటల సమయానికి నిమ్మకూరు చేరుకుంటారని వెల్లడించారు. ఎన్టీఆర్ బయోపిక్లో విద్యాబాలన్..బసవతారకంగా నటించింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..