స్వల్ప సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సేవలకు అంతరాయం
- January 08, 2019అల్ రషిద్యా స్టేషన్ మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ స్టేషన్ మధ్య చిన్న సాంకేతిక సమస్య కారణంగా మెట్రో సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పేర్కొంది. దుబాయ్ మెట్రోకి చెందిన రెడ్ మరియు గ్రీన్లైన్స్కి సంబంధించి యూనియన్ స్టేషన్ వద్ద నాలుగు నిమిషాల ఆలస్యం చోటు చేసుకుంది. దాంతో బుర్జుమన్ స్టేషన్ మరియు ఎడిసిబి స్టేషన్ వద్ద ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం పీక్ టైమ్లో ఈ సమస్య రావడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఇతర స్టేషన్లలో సమస్యలేమీ తలెత్తలేదని ఆర్టిఎ పేర్కొంది. చిన్న సమస్య కారణంగా లాంగ్ డిలేస్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణీకులు వాల్పోయారు. అల్ రషిదియా మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ వద్ద ట్రైన్స్ని రెడ్ లైన్ మీద ఆపివేసినట్లు ప్రయాణీకులు సోషల్ మీడియాలో తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి