ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి, నలుగురికి గాయాలు
- January 12, 2019యూ.ఏ.ఈ:రోడ్డు మీద వెళుతున్న వాహనం ప్రమాదానికి గురవగా, మంటలు వ్యాపించి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎమిరేట్స్ రోడ్డుపై మధ్యాహ్నం 1.45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన అధికారులు ప్రమాదానికి గురయ్యారు. కాంక్రీట్ బ్యారియర్ని అతి వేగంతో కారు ఢీకొంది. ఆ తర్వాత కారు బోల్తా కొట్టింది. మంటలు వ్యాపించగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మిగతావారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కాసిమి హాస్పిటల్లో వీరికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా వుండాలనీ, అతి వేగం ప్రమాదాలకు ముఖ్య కారణమని షార్జా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలిద్ మొహమ్మద్ అల్కే చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్తో తీరనున్న అనుబంధం..
- TGSRTC ప్రయాణికులకు శుభవార్త...
- ఏపీలో కూటమిదే అధికారం..పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
- టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. రేపటి నుంచే ప్రారంభం..
- ఈద్ అల్ అదా.. బలి జంతువుల ధరలు తగ్గుతాయా?
- ఫర్వానియాలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధం
- Dh4,400 ఆదా.. 3-రోజుల సూపర్ సేల్..!
- 'రోజుకు Dh800 సంపాదించండి': వాట్సాప్ స్కామర్లపై హెచ్చరిక
- బౌషర్లో కార్మికుడు మృతి
- సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం