ఈద్ అల్ అదా.. బలి జంతువుల ధరలు తగ్గుతాయా?
- June 01, 2024
దుబాయ్: దుబాయ్ మరియు షార్జాలోని పశువుల మార్కెట్లు ఇప్పుడు ఈద్ అల్ అదాకు ముందు బలి జంతువుల రాక ప్రారంభమైంది. స్థానికంగా డిమాండ్ పెరగడంతో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, సోమాలియా నుంచి తెచ్చిన మేకలు, గొర్రెలు, ఆవులను వ్యాపారులు ఎక్కువగా విక్రయిస్తున్నారు. ప్రస్తుత ధరలు సాధారణం కంటే కొంచెం ఖరీదైనవిగా ఉన్నాయని చెబుతున్నారు. మేకలు Dh500కి విక్రయిస్తున్నట్లు, త్వరలో రేట్లు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. "7 కిలోల బరువున్న సోమాలియన్ మేకల ధర సుమారుగా Dh500 ఉంది. అదే జాతికి చెందిన పెద్ద మేకలు 15 కిలోల వరకు బరువు మరియు Dh800 వరకు ఉంటాయి." అని అల్ ఖమ్మాస్ పశువుల వ్యాపారానికి చెందిన మహ్మద్ అతీక్ చెప్పారు. అదే విధంగా, భారతీయ మేకల ధరలు 8 కిలోలకు Dh800 నుండి ప్రారంభమవుతాయన్నారు. పెద్ద పరిమాణాల కోసం ధరలు Dh1,200 వరకు ఉంటుందని చెప్పారు. ఈద్ అల్ అదాకు ముందు రోజుల్లో మరిన్ని జంతువులు రావడంతో ధరలు తగ్గవచ్చని విక్రేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







