TGSRTC ప్రయాణికులకు శుభవార్త...
- June 01, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ)లో 8 కొత్త మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ బస్సులు ఈసీఐఎల్ క్రాస్రోడ్స్ నుంచి ఏఎస్రావు నగర్, సైనిక్పురి, అమ్ముగూడ, లాల్బజార్, కర్జన, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయని పేర్కొన్నారు. తిరిగి అదే మార్గంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్కు వెళ్తాయన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుకుంటోందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







