TGSRTC ప్రయాణికులకు శుభవార్త...
- June 01, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ)లో 8 కొత్త మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ బస్సులు ఈసీఐఎల్ క్రాస్రోడ్స్ నుంచి ఏఎస్రావు నగర్, సైనిక్పురి, అమ్ముగూడ, లాల్బజార్, కర్జన, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయని పేర్కొన్నారు. తిరిగి అదే మార్గంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్కు వెళ్తాయన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుకుంటోందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..