TGSRTC ప్రయాణికులకు శుభవార్త...
- June 01, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ)లో 8 కొత్త మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ బస్సులు ఈసీఐఎల్ క్రాస్రోడ్స్ నుంచి ఏఎస్రావు నగర్, సైనిక్పురి, అమ్ముగూడ, లాల్బజార్, కర్జన, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయని పేర్కొన్నారు. తిరిగి అదే మార్గంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్కు వెళ్తాయన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుకుంటోందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









