దుబాయ్:ఎన్టీఆర్ 23వ వర్థంతి సంధర్భంగా తెలుగు ప్రవాసీయులు ఘన నివాళి
- January 18, 2019దుబాయ్:యూఏఈ లోని తెలుగు ప్రవాసీయులు ఎన్టీఆర్ వర్థంతి సంధర్భంగా అయన చేసిన ఘనతను స్మరించుకుంటూ ఓ తెలుగు బిడ్డ నిన్ను మరవదు ఈ తెలుగు గడ్డ బిడ్డలు అని గుర్తుచేసుకున్నారు. తెలుగుప్రజలేకాకుండా తమిళప్రజలు , కన్నడ ప్రజలు కూడా వర్థంతి జరుగుతున్న ప్రదేశాన్ని తెలుసుకుని స్వచ్చందంగా పాల్గొన్నారు . అయన చేసిన సేవలను తరతరాలకు గుర్తుండి పోయేలా ఉన్నాయని స్మరించుకున్నారు , దేశవిదేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నతి స్తానం దొరకడం కేవలం ఎన్టీఆర్ ఆనాడు చేసిన ఎన్నో పనులేనని తెలుగు ప్రజలు స్మరించుకున్నారు.
ఇప్పటికీ, రేపటికి, భవిష్యత్కి రైతుల కోసం ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. హెచ్పీకి రూ.50 తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, 2 రూపాయల బియ్యానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరే అని ప్రవాసీయులు కొనియాడారు. పరిపాలన అంటే ఏవిధంగా ఉండాలో ఎన్టీఆర్ చూపించారన్నారు. అధికారం కోసం ఆయన పార్టీ పెట్టలేదని, డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని పాల్గొన్న వక్తలు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు