ఇండియాకి ప్రమోషనల్ రేట్స్ ప్రకటించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
- January 18, 2019బహ్రెయిన్ నుంచి కోజికోడ్, కోచి, తిరువనంతపురం మరియు మంగళూరుకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 'ఆల్ ఇంక్లూజివ్' ప్రమోషనల్ ఫేర్స్ని ప్రకటించింది. జనవరి 17 నుంచి 23 మధ్య టిక్కెట్లను బుక్ చేసుకుని జనవరి 17 నుంచి మార్చి 30 లోపు ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బహ్రెయిన్ నుంచి కోచి ప్రయాణానికి 47 బహ్రెయినీ దినార్స్ నుంచి ధరలు మొదలవుతాయి. బహ్రెయిన్ నుంచి కోజికోడ్కి టిక్కెట్ ధరలు 52 బహ్రెయినీ దినార్స్, బహ్రెయిన్ నుంచి మంగళూరుకి 62 బహ్రెయినీ దినార్స్ నుంచి టిక్కెట్ ధరలు వుంటాయి. వీటితోపాటుగా 30 కిలోలల ఉచిత బ్యాగేజీ అలవెన్స్ని కూడా అందించనుంది. ప్రయాణీకులకు 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీని అందిస్తారు. 5 కిలోల అదనపు బ్యాగేజీని 8 బహ్రెయినీ దినార్స్ చెల్లించి తీసుకెళ్ళొచ్చు. 25 బోయింగ్ 737-800 ఎన్జి విమానాల్ని కలిగి వున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 13 అంతర్జాతీయ 20 డొమెస్టిక్ డెస్టినేషన్స్ని కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం