అభిమానులకు షాకిచ్చిన తలైవా!

- February 17, 2019 , by Maagulf
అభిమానులకు షాకిచ్చిన తలైవా!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు షాకిచ్చారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు రజనీ. అంతే కాదు తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు తెలిపారు రజనీకాంత్‌. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు.

రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కానీ తాజా ప్రకటనతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.

రజనీ కాంత్ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పార్టీ పేరేంటి? దాని విధి విధానాలేంటి అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com