మహేష్ 'ఎ ఎం బి' లో జిఎస్టీ స్కామ్

- February 20, 2019 , by Maagulf
మహేష్ 'ఎ ఎం బి' లో జిఎస్టీ స్కామ్

సూపర్‌స్టార్ మహే ష్ బాబుకు మరోసారి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆయనకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి జిఎస్టీ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు జిఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త అమల్లోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలు ఏఎంబీ మాల్‌ అతిక్రమించిందని పేర్కొంటున్నారు. రూ.100 ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. జనవరి 1 నుంచి 18 శాతానికి, రూ.100 లోపు టికెట్‌పై 18 శాతాన్ని కాస్తా 12కు తగ్గించింది. అయితే ఏఎంబీ మాల్‌ తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేసిందని అంటున్నారు.. దీనిపై థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు జిఎస్టీ అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com