జమ్మూకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం..కశ్మీర్ రాజకీయ నేతల భద్రతా సిబ్బంది ఉపసంహరణ
- February 21, 2019శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 155 మంది రాజకీయ నాయకులకు భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ గవర్నరు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులకు భద్రత అవసరం లేదని సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఐఏఎస్ అధికారిగా ఉండి ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైజల్ కు ఉన్న సెక్యూరిటీని సైతం హోంశాఖ అధికారులు తొలగించారు. దీంతో వెయ్యిమంది పోలీసులతోపాటు వంద వాహనాలు పోలీసు శాఖకు తిరిగివచ్చాయి. వీటిని పోలీసు పహరాకు వినియోగించాలని నిర్ణయించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్న కశ్మీర్ ప్రత్యేక వాదులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖమంత్రి హెచ్చరించారు. రాజకీయ నాయకులతో పాటు 18 మంది హురియత్ నేతలు, ఎస్ఎఎస్ గీలానీ, అబ్దుల్ ఘనీ షా, యాసీన్ మాలిక్, మమ్మద్ ముసాదిఖ్ భట్ ల భద్రతా సిబ్బందిని ఉపసంహరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!