స్మగ్లింగ్ - ఒమన్లో 10 మంది అరెస్ట్
- February 21, 2019మస్కట్: పది మంది వలసదారులు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. డీజిల్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్మగుల్ చేస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ముసాందామ్ మరియు సలాలాలోని తీర ప్రాంతాల్లో నిందితులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దోఫార్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, పోర్ట్ ఆఫ్ సలాలా దగ్గరలో ఫిషింగ్ బోట్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారనీ, వారి నుంచి కొంత మొత్తంలో ఖత్ని స్వాధీనం చేసుకున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితుల వద్ద 2200 ప్యాకెట్ల ఖత్ లభ్యమయ్యింది. ముసాందామ్ గవర్నరేట్లో కోస్ట్ గార్డ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఆసియా జాతీయులే. డీజిల్ని బోట్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మరో కేసులో కోస్ట్గార్డ్ పెట్రోల్ - కుమ్జార్, ముగ్గురు వ్యక్తుల్ని తీసుకెళుతున్న బోట్ని సీజ్ చేశారు. అందులో వున్న ముగ్గురు వ్యక్తులు ఆసియాకి చెందినవారే.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు