తెలంగాణ:అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
- February 22, 2019హైదరాబాద్ః తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. జవాన్ల ప్రాణాలు పోకుండా కేంద్రం పటిష్టమైన విధానం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జవాన్లకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించనున్నారు. శాసనసభ ప్రారంభం కంటే ముందు బడ్జెట్ పత్రాలను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం