దర్శకురాలు అనుమానాస్పద మృతి
- February 25, 2019కేరళకు చెందిన యువ దర్శకురాలు నయన సూర్యన్ అనుమానాస్సద స్థితిలో మృతి చెందారు. సినిమాలపై ఉన్న అసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన
ఆమె పలు చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ‘క్రాస్వర్డ్’ అనే సినిమా ద్వారా మాలీవుడ్లో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు.సినిమాల్లోకి రాకముందు.
నయన నాటక రంగంలో పనిచేశారు. అలాగే పలు ప్రకటనలను కూడా రూపోందించారు.
కాగా ఆదివారం రాత్రి ఆమె తన ఫ్లాట్లో శవమై కనిపించారు. అమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నయన తల్లి ఆమెకు ఫోన్ చేయగా ఎంతకు ఎత్తలేదు. దీంతో ఆమె ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమె స్నేహితులకి ఫోన్ చేశారు. ఈ క్రమంలో వారు తిరువనంతపురులోని ఆమె ఫ్లాట్లోకి వెళ్లి చూడగా.. ఆమె విగితా జీవిగా పడివు్న్నారు. ఈ విషయంపై ఆమె స్నేహితురాలు మీడియాతో మాట్లాడారు. నయన గత కొంతకాలంగా డయాబెటిస్తో బాధ పడుతున్నట్లు తెలిపారు. అలాగే కొద్దిరోజుల క్రితం మృతి చెందిన డైరెక్టర్ లెనిన్ రాజేంద్రన్ ఆమెకు గురువు. అతని దగ్గర నయన దర్శకత్వ మెళకువలను నేర్చుకున్నారు. రాజేంద్రన్ ఆకస్మిక మృతి తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్వక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక అనంతరం నిజానిజాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్వాప్తులో ఉందని పూర్తి విచారణ తర్వాత మృతి గల కారణాలను వెల్లడిస్తామన్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…