రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ మృతి
- March 09, 2019రస్ అల్ ఖైమా:రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్డుపై ఎగ్జిట్ 122కి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందినవారంతా 15 నుంచి 19 ఏళ్ళ లోపు వయసువారే. రస్ అల్ ఖైమా ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కంట్రోల్ హెడ్ కల్నల్ మొహమ్మద్ అల్ బహ్మార్ మాట్లాడుతూ, సాయంత్రం 6.55 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి రికార్డు సమయంలో చేరుకోవడం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఎమిరేటీలు ఒక ఆసియా వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఎమిరేటీ యువకులు కూడా గాయపడ్డారు. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు