అప్లికెంట్స్‌కి అడ్మిషన్లు ఇవ్వనున్న ఒమన్‌ ఇండియన్‌ స్కూల్స్‌

- March 12, 2019 , by Maagulf
అప్లికెంట్స్‌కి అడ్మిషన్లు ఇవ్వనున్న ఒమన్‌ ఇండియన్‌ స్కూల్స్‌

మస్కట్‌: ఇండియన్‌ స్కూల్స్‌లో అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న చిన్నారులందరికీ అడ్మిషన్స్‌ లభించనున్నట్లు ఇండియన్‌ స్కూల్‌ బోర్డ్‌ ప్రకటించింది. మొత్తం 4,700కి పైగా అప్లికేషన్లు అందినట్లు తెలిపింది. గతంలోలా కాకుండా, ఈసారి ప్రతి ఒక్కరికీ సీటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఒమన్‌ ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ బేబీ సామ్‌ సామ్యూల్‌ చెప్పారు. ఆదివారం సాయంత్రం ఈ మేరకుత తొలి డ్రా జరగనుంది. 4,746 మంది చిన్నారులు దరఖాస్తు చేసుకున్నారనీ, ఆన్‌లైన్‌ ర్యాండమ్‌ డ్రా ద్వారా 2019-2020 సంవత్సరానికి అడ్మిషన్లు ఇవ్వబోతున్నామని సామ్యూల్‌ వివరించారు. కిండర్‌ గార్టెన్‌ నుంచి 9వ క్ల్రాస్‌ వరకు అడ్మిషన్లు జరుగుతాయి.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com