వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ల యూజర్లను బ్యాన్ చేసిన వాట్సాప్
- March 12, 2019వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ల యూజర్లను బ్యాన్ చేస్తునట్లు ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, భద్రతా కారణాల దృష్ట్యా ఆ వాట్సాప్లను వినియోగిస్తున్న యూజర్లను నిషేధించినట్లు వెల్లడించింది. ఈ అనుబంధ యాప్లను థర్డ్పార్టీ డెవలపర్లు తయారు చేశారు. అయితే, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, అధికారిక వాట్సాప్ నియమ నిబంధనలను, సేవలను అతిక్రమించడంతో ఈ చర్యలకు దిగినట్లు వాట్సాప్ పేర్కొంది. వినియోగదారులందరూ అధికారిక వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆ వెర్షన్లను వినియోగిస్తున్న వారు అధికారిక వాట్సాప్నకు ఎలా మారాలో కూడా సూచనలు చేసింది.
''మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడింది' అని మీ వాట్సాప్నకు సందేశం వస్తే, మీరు అఫిషియల్ వాట్సాప్ను కాకుండా థర్డ్ పార్టీ తయారు చేసిన వాట్సాప్ను వినియోగిస్తున్నట్లు అర్థం. వాట్సాప్ను వినియోగించడానికి అధికారిక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే'' అని సంస్థ తెలిపింది. అదే సమయంలో ఇప్పటి వరకూ మీ స్నేహితులతో కొనసాగించని సంభాషణలన్నీ అఫిషియల్ వాట్సాప్కు బదిలీ చేసే విషయంలో గ్యారెంటీ ఇవ్వలేమని తెలిపింది. ఎందుకంటే అనధికార యాప్స్కు తాము మద్దతు తెలపమని స్పష్టం చేసింది.
మీరు ఏ వాట్సాప్ వాడుతున్నారో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!
* Open your app.
* Go to 'More Options' GO
* Go to 'Settings'
* Tap on Help
* name from App info.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్