ఖతర్ లో ఘనంగా ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలు

- March 13, 2019 , by Maagulf
ఖతర్ లో ఘనంగా ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలు

ఖతర్:నిజామాబాద్  పార్లమెంట్ సభ్యులు, TRS NRI అడ్వైసర్, కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా TRS ఖతర్ ఆధ్వర్యం లొ దోహా లొ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

TRS ఖతర్ అధ్యక్షులు శ్రీధర్ అబ్బగౌని  కేక్ కట్ చేసి కవిత కి శుబాకాంక్షలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని ,జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ పడకంటి , కోశాధికారి ప్రమొద్ కెథే, ఇండస్ట్రియల్ ఏరియా ఇంచార్జి శంకర్ సుందరగిరి ,యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట,ఉపాధ్యకశుడు విష్ణు వర్ధన్ రెడ్డి ,TRS సీనియర్ నాయకులు మధు మ్యాక, మొహమ్మద్ హుమయున్,శంకరచారి బొప్పరపు,రాజి రెడ్డి సరసం, తేజా కుంభొజి, మహేశ్ వంగల మరియు తెలంగాణ జాగృతి నాయకులు శశాంక్ అల్లకొండ , శేఖర్ చిలువెరి,యెల్లయ్య తాళ్లపెళ్లి ,శ్రీకాంత్ కొమ్ముల ఇతరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా  ఉపాధ్యక్షుడు బందారపు శోభన్ గౌడ్ మాట్లాడుతూ దేశ్ కా నేత,  ప్రియతమ ముఖ్యమంత్రి మరియు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR  ఆధ్వర్యంలో వచ్చే పార్లమెంట్   ఎన్నికల్లో TRS 17లో16 స్థానాలు కైవసం చేసుకుంటుందని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కవిత గారికి దేశంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందని, దేశ రాజకీయాల్లో TRS కీలక భూమిక నిర్వహించబొతుఉందని తెలిపారు.

--రాజ్ కుమార్  వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com