చైనా తీరు మారలేదు..అజర్ ను మళ్ళీ వెనకేసుకొస్తున్న చైనా
- March 14, 2019బీజింగ్: మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను మరోసారి అడ్డుకున్న చైనా.. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ అంశంలో మరింత లోతైన విచారణ చేపట్టడానికి ఇంకా సమయం కావాలని చైనా చెప్పడం గమనార్హం. అదే సమయంలో తాము ఇండియాతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని, ఇలాంటి అంశాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసమే తాము చూస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ వివరించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నించగా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీకి వచ్చే ప్రతి దరఖాస్తునూ చైనా క్షుణ్నంగా, లోతుగా పరిశీలిస్తుందని, దీనికి మరింత సమయం కావాలని లూ కాంగ్ చెప్పారు. ఓ వ్యక్తి లేదా సంస్థపై ఉగ్రవాద ముద్ర వేయడానికి భద్రతా మండలి ఆంక్షల కమిటీకి కొన్ని ప్రామాణికాలు, ప్రక్రియలు ఉన్నాయి. వాటిపై చైనా పూర్తిగా అధ్యయనం చేస్తుంది. అందుకే మేము ఈ అంశాన్ని సాంకేతికంగా నిలిపి ఉంచామని లూ కాంగ్ వెల్లడించారు. ఈ ప్రాంత సుస్థిరత, శాంతికి చైనా బాధ్యతయుతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇండియా, చైనా సంబంధాలపై ప్రశ్నించగా.. ఇప్పటికే జీ జిన్పింగ్, మోదీ గతేడాది నాలుగుసార్లు భేటీలు నిర్వహించారని, రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన