ఒమన్ బోట్ ట్రాడెడీ: చివరి మృతదేహం లభ్యం
- March 15, 2019మస్కట్: హృదయ విదారకమైన బోట్ యాక్సిడెంట్కి సంబంధించి చివరి మృతదేహాన్ని ఎట్టకేలకు అధికారులు కనుగొన్నారు. రాయల్ ఒమ్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. విలాయత్ ఆఫ్ మహౌత్ షోర్లైన్లో ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. మార్చి 8న ఆరుగురు ఒమనీ పౌరులు, వలాయత్ ఆఫ్ మహౌత్ మీదుగా ఫిషింగ్ ట్రిప్కి వెళ్ళారు. ఈ క్రమంలో బోటు మునిగిపోయింది. స్థానికంగా వున్నవారు ఈ ప్రమాదాన్ని గుర్తించి, ఇద్దర్ని రక్షించగలిగారు. అయితే మరో ఇద్దర్ని మాత్రం కాపాడలేకపోయారు, వారి మృతదేహాల్ని బయటకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, అందులో ఒకరి మృతదేహం బుధవారం దొరికింది. ఇప్పుడు మరో మృతదేహం దొరికిందని, ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం