కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- May 02, 2024
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు ఇటీవల ఆ టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. కోవిడ్19 టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ సర్టిఫికేట్లో ఉండే ప్రధాని మోడీ ఫోటోను ఆ సర్టిఫికేట్ నుంచి తొలగించారు. చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ వల్ల .. రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నట్లు ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవల అంగీకరించింది. కానీ భారత్లో ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ సర్టిఫికేట్లో మోడీ ఫోటోను తొలగించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిన్ సర్టిఫికేట్ నుంచి మోడీ ఫోటోను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్జెవేరియా పేరుతో టీకాను సరఫరా చేస్తున్నది. ఆ టీకానే కొవిషీల్డ్ పేరుతో ఇండియాలో అందించారు. ఇండియాలో ఆ టీకాను సీరం సంస్థ తయారు చేసిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్ వల్ల కొన్ని అరుదైన కేసుల్లో బ్లడ్ క్లాట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా తేలింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







