డబల్ రోల్ లో కనిపించనున్న కీర్తి
- March 25, 2019మహానటి చిత్రంతో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి..ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హిట్స్ కాలేకపోయాయి. అయినాగానీ అమ్మడికి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ ఆఫర్ కూడా ఒకటి. ఫుట్ బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపిస్తుండగా.. అతని భార్యగా కీర్తి నటించనుంది. కథ ప్రకారం సినిమాలో కీర్తి డబుల్ రోల్ ప్లే చేస్తోందట. అందులోఒకటి మధ్యవయస్కురాలి పాత్ర..మరోటి యంగ్ గా కనిపిస్తుందట. మధ్యవయస్కురాలి పాత్ర కోసం టీమ్ ఆమెకు ప్రత్యేకమైన మేకప్ వేయనున్నట్లు సమాచారం. 1953 నుంచి 1963 వరకు ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు అబ్దుల్ రహీం అనే వ్యక్తి కోచ్ గా పనిచేశారు. ఆయన జీవితం ఆధారంగా అమిత్ శర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బోనికపూర్, ఆకాష్ చావ్లా, అరణవ సేన్ గుప్తాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్