హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- May 19, 2024
విశాఖపట్నం: విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా దేశానికి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి భారత్ నుంచి ఉద్యోగాల పేరిట హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు నిందితులు.
విశాఖ సీపీ రవి శంకర్ మాట్లాడారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పారు. మొత్తం దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఫెడ్ ఎక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చెయ్యడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని తెలిపారు.
ఇక్కడ నుంచి కంబోడియాకి వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. 80 వేల రూపాయలను కంబోడియా దేశంలో ఏజెంట్ కి ఇస్తారని తెలిపారు. ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు.
అన్నం పెట్టకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాజేశ్ వినయ్ కుమార్ పేరిట చీఫ్ ఏజెంట్ ఉన్నాడని చెప్పారు. చైనాకి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి లింక్స్ ఉన్నాయని తెలిపారు. ఈ స్కాంలో హనీ ట్రాప్ కూడా ఉందని, అమ్మాయిలను నగ్నంగా కూడా చూపిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!







