హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- May 19, 2024
విశాఖపట్నం: విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా దేశానికి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి భారత్ నుంచి ఉద్యోగాల పేరిట హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు నిందితులు.
విశాఖ సీపీ రవి శంకర్ మాట్లాడారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పారు. మొత్తం దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఫెడ్ ఎక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చెయ్యడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని తెలిపారు.
ఇక్కడ నుంచి కంబోడియాకి వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. 80 వేల రూపాయలను కంబోడియా దేశంలో ఏజెంట్ కి ఇస్తారని తెలిపారు. ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు.
అన్నం పెట్టకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాజేశ్ వినయ్ కుమార్ పేరిట చీఫ్ ఏజెంట్ ఉన్నాడని చెప్పారు. చైనాకి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి లింక్స్ ఉన్నాయని తెలిపారు. ఈ స్కాంలో హనీ ట్రాప్ కూడా ఉందని, అమ్మాయిలను నగ్నంగా కూడా చూపిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







