హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- May 19, 2024
విశాఖపట్నం: విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా దేశానికి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి భారత్ నుంచి ఉద్యోగాల పేరిట హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు నిందితులు.
విశాఖ సీపీ రవి శంకర్ మాట్లాడారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పారు. మొత్తం దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఫెడ్ ఎక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చెయ్యడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని తెలిపారు.
ఇక్కడ నుంచి కంబోడియాకి వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. 80 వేల రూపాయలను కంబోడియా దేశంలో ఏజెంట్ కి ఇస్తారని తెలిపారు. ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు.
అన్నం పెట్టకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాజేశ్ వినయ్ కుమార్ పేరిట చీఫ్ ఏజెంట్ ఉన్నాడని చెప్పారు. చైనాకి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి లింక్స్ ఉన్నాయని తెలిపారు. ఈ స్కాంలో హనీ ట్రాప్ కూడా ఉందని, అమ్మాయిలను నగ్నంగా కూడా చూపిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









