పాక్ లో హిందూ అమ్మాయిల కిడ్నాప్ కలకలం..
- March 25, 2019పాకిస్థాన్లో హిందూమతానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్ల అపహరణ-బలవంతపు మతమార్పిడి ఉదంతం తీవ్ర కల కలం రేపుతోంది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే ప్రమాదమున్న నేపథ్యంలో 2 దేశాల ప్రభుత్వాలు సీరియస్గా స్పందించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపాలని పాకిస్థాన్లోని భారత రాయ బారి ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ ఘటనపై మీడియా కథ నాలను పొందుపరుస్తూ పాక్లోని భారత హైకమిషనర్కు వివరాలు అందించారు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో హోళీ పండుగ రోజున ఇద్దరు అక్కాచెల్లెళ్లు కిడ్నాపయ్యారు. ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో జిల్లాలో రవీనా, రీనాలను ఇంటి నుంచే కొందరు వ్యక్తులు అపహరించారు. తర్వాత వారికి వివాహం చేసి ముస్లిం మతంలోకి మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతం మార్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. ఇందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..