హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం

- April 14, 2019 , by Maagulf
హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం

నేపాల్‌:నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సమ్మిట్‌ ఎయిర్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ హెలిప్యాడ్‌లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్‌మండూకు వెళ్లాల్సి ఉండగా అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌ అవుతున్న విమానం రన్‌వేపై నుంచి అదుపుతప్పి హెలిప్యాడ్‌లో ఉన్న రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై రామ్‌ బహదూర్‌, కోపైలట్‌ ఢుంగానా అక్కడిక్కడే మృతి చెందారు. ఏఎస్సై బహదూర్‌ శ్రేష్ఠ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలొదిలరాని వైమానిక అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com