బాటాకు చేదు అనుభవం
- April 15, 2019చండీగఢ్:నిజానికి దినేష్ ప్రసాద్ గారిలా రోజువారీ కొనుగోళ్లలో ఎంతో నష్టపోతుంటాడు వినియోగ దారుడు. అన్యాయంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నించే టైము, వాగ్యుద్ధానికి దిగే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. పంజాబ్ చండీగఢ్కి చెందిన దినేష్ బాటా షోరూంకి వెళ్లి బూట్లు కొనుగోలు చేశారు. వాటి రేటు రూ.402లు, షూస్ని పేపర్ బ్యాగ్లో పెట్టిస్తూ దాని బ్యాగ్ రేటు రూ.3లు అని బిల్లులో వేశారు.
దానికి ఆగ్రహం చెందిన దినేష్ మీ షోరూం ప్రమోషన్ కోసం బాటా లోగో వేసిన ఉన్న బ్యాగ్ ఇస్తూ.. పైపెచ్చు దానికి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అని యాజమాన్యం మీద రివర్సయ్యాడు. ఆ 3రూ.లు నేనివ్వను. ఫ్రీగా ఇవ్వండి బ్యాగ్ అని అడిగాడు. దానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో దీనేష్ వెళ్లి వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశాడు. దినేష్ వాదనను విన్న ఫోరం.. బాటాకు జరిమానా విధించింది.
పేపర్ బ్యాగ్కి బలవంతంగా రూ.3లు వసూలు చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కస్టమర్లు ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు పేపర్ బ్యాగ్ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. వ్యాజ్యంకు రూ.1000, మానసిక ఆందోళనకు రూ.3000, లీగల్ ఎయిడ్ నిధికి రూ.5,000లు, కంప్లైంట్ చేయడానికి అయిన ఖర్చు రూ.1000లు చెల్లించమంటూ బాటాని ఆదేశించింది.
ప్రతి వినియోగదారుడికి ఉచితంగా క్యారీ బ్యాగ్ అందజేయాలని ఆదేశించింది. చాలా స్టోర్లలో క్యారీ బ్యాగ్ పేరుతో రూ.3 నుంచి రూ.5లు వసూలు చేస్తుంటారు. అడిగేవారు లేకపోవడంతో అడ్డంగా దోచేస్తున్నారు. దినేష్ ప్రసాద్ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతైనా అవసరం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు