తమిళనాడు పోలింగ్.. ఓటేసిన సినీ ప్రముఖులు
- April 18, 2019దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు (గురువారం) ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూ కట్టారు. తమిళ ప్రముఖ నటులు సూర్య, కార్తి, జ్యోతిక క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సూపర్స్టార్ రజినీకాంత్ ఓటేసేందుకు ముంబై నుంచి తమిళనాడు వచ్చారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, విశ్వనటుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలోని ఆల్వార్పేటలో క్యూలో నిలుచుని ఓటేశారు. ఇక, తమిళ స్టార్ హీరో అజిత్, ఆయన భార్య షాలినీ, మరో స్టార్ హీరో విజయ్, `బిచ్చగాడు` హీరో విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం