శ్రీలంక పేలుళ్ళను ఖండించిన సుల్తానేట్
- April 22, 2019మస్కట్: అత్యంత కిరాతకంగా జరిగిన వరుస పేలుళ్ళు శ్రీలంకలో పరిస్థితిని భీతావహంగా మార్చేయడంపై ఒమన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పేలుళ్ళను ఖండిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా, దాన్ని అంతమొందించాల్సిందేననీ, ఈ కష్టకాలంలో శ్రీలంకకు తాము అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఒమన్ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంకలో వున్న ఒమన్ పౌరుల భద్రత విషయమై అక్కడి ఎంబసీతో మినిస్ట్రీ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ఫోన్ నెంబర్లను ప్రకటనలో పేర్కొని, అత్యవసర సందర్భాల్లో ఒమన్ పౌరులు, శ్రీలంకలో ఈ నెంబర్లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం