శివకార్తికేయన్ ఓటేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం
- April 24, 2019ఓటరు జాబితాలో పేరు లేకున్నా.. తమిళ నటుడు శివకార్తికేయన్ ఓటేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులో ఈనెల 18న రెండో దశ పోలింగ్ జరిగింది. ఓటు వేసేందుకు నటుడు శివకార్తికేయన్ దంపతులు వలసరవక్కంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఉంది.. కార్తి కేయన్ పేరు మాత్రం గల్లంతైంది. అయినా ఓటేశారు.
అయితే దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రత్యేక అనుమతి తీసుకుని ఓటు వేశానని చెప్పి వెళ్లిపోయారు శివకార్తికేయన్ . అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు . ఇది కాస్త సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఎలా ఓటు వేశారంటూ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అక్కడి పోలింగ్ కేంద్రం అధికారుల తప్పిదమే అంటూ.. వారిపై చర్యలకు ఆదేశింశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ