జపాన్ నూతన చక్రవర్తి గా నరూహితో పట్టాభిషేకం
- May 01, 2019టోక్యో: జపాన్ నూతన చక్రవర్తి నరూహితో సింహాసనాన్ని అధిష్ఠించారు . ఈ మేరకు వారసత్వంగా సంక్రమించే ఖడ్గం, నగలు, రాజముద్రలను అందుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం అతి కొద్దిమంది ప్రముఖుల మధ్య జరిగింది. కొత్త చక్రవర్తి భార్య సహా రాజవంశానికి చెందిన మహిళలు ఎవరినీ ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి జపాన్ 126వ చక్రవర్తి హోదాలో నరూహితో తొలిసారి ప్రసంగించారు. కొత్త రాజు శకానికి శుభప్రదమైన కాలంగా నామకరణం చేశారు. అక్టోబర్ 22న ప్రజల మధ్య కొత్త చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరై జపాన్ కొత్త చక్రవర్తి నరూహితోకు శుభాకాంక్షలు తెలపనున్నారు. 85 ఏళ్ల అకిహితో జపాన్ చక్రవర్తిగా వైదొలగడంతో ఆయన కుమారుడు నరూహితో ఈ రోజు సింహాసనాన్ని అధిష్ఠించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్