కన్ఫర్మ్: మహేశ్ కోసం వెంకీ, విజయ్ దేవరకొండ రెడీ
- May 01, 2019మహేశ్ బాబు 25వ చిత్రం'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్లోని నెక్లస్రోడ్లో ఈ కార్యక్రమం జరగనుండగా.. దీనికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం వెంకటేశ్, మహేశ్ బాబు తొలిసారిగా కలిసి నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో గతంలో మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' ఆడియో ఫంక్షన్కు కూడా వెంకటేశ్ చీఫ్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చిన్న హీరోల ఫంక్షన్లకు అతిథిగా రాగా.. తొలిసారిగా ఓ పెద్ద స్టార్ నటుడికి గెస్ట్గా మారడం విశేషం.
కాగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'మహర్షి' చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దిల్ రాజ్, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో 'మహర్షి'పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!