18న శనివారం జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ప్రారంభం
- May 17, 2019అమీర్పేట టూ హైటెక్ సిటీ మెట్రో మార్గం మొత్తం క్లియర్ అయ్యింది. పెండింగ్ లో ఉన్న, కీలకమైన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ను ప్రారంభించటానికి ముహూర్తం ఖరారు చేశారు. 2019, మే 18వ తేదీ శనివారం ఉదయం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో మెట్రో సర్వీసులు మార్చి 20న ప్రారంభం అయ్యాయి.
మాదాపూర్, పెద్దమ్మతల్లి, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మెట్రోస్టేషన్లలో సర్వీసులకు బ్రేక్ పడింది. విడతల వారీగా మొదట మాదాపూర్, ఆ తర్వాత పెద్దమ్మతల్లి స్టేషన్లను ప్రారంభించారు. మిగిలిన ఒకే ఒక్క జూబ్లీహిల్స్ స్టేషన్ ను మాత్రం మే 18, శనివారం నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్ నుంచి హైటెక్ సిటీ మధ్యలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లే.
అమీర్ పేట టూ హైటెక్ సిటీ మధ్యలో స్టేషన్లు :
1. మధురానగర్
2. యూసఫ్ గూడ
3. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-5
4. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు
5. పెద్దమ్మతల్లి గుడి
6. మాదాపూర్
7. దుర్గంచెరువు
8. హైటెక్ సిటీ
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్