హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- May 21, 2019ముగ్గురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులేనని అధికారులు వివరించారు. నిందితులు ముగ్గురూ కలిసి ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. హతుడు కూడా ఆసియా జాతీయుడే. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతోనే నిందితులు, తమ సహచరుడ్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్గిఏషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డివిజన్ - ఇంటీరియర్ మినిస్ట్రీ అత్యంత వ్యూహాత్మకంగా విచారణ జరిపి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. హత్యకు వినియోగించిన ఆయుధాల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి తీవ్రమైన కత్తి పోట్లతో రోడ్డుపై పడి వుండగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. విచారణలో అతన్ని హత్య చేసింది సహచరులేనని తేలింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం