హీరోగా శ్రీహరి చిన్న కొడుకు
- May 21, 2019విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు స్వర్గీయ, రియల్ స్టార్, డా. శ్రీహరి.. కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉండగా 49 ఏళ్ళ వయసులో తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. తెరమీదే కాదు, తెర వెనక కూడా ఆయన రియల్ స్టారే.. పేదలకు సాయం, గ్రామల దత్తత వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు శ్రీహరి.. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.. ఇప్పుడు శ్రీహరి ఇంటినుండి మరో నటుడు తెరంగేట్రం చెయ్యనున్నాడు..
శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకు శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన భైరవ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో మేఘాంశ్ నటనకు మంచి స్పందన వచ్చింది. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న మేఘాంశ్, నటనకు సంబంధించిన అన్ని రంగాలలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మేఘాంశ్ మొదటి సినిమాని కార్తీక్ - అర్జున్ కలిసి డైరెక్ట్ చెయ్యనుండగా, ఈ సినిమాకి 'రాజ్ దూత్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు