మక్కా, జెడ్డాపై మిస్సైల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- May 22, 2019యెమెన్కి చెందిన తీవ్రవాదులు సౌదీ అరేబియాలోని మక్కా మరియు జెడ్డాపై దాడి కోసం మిస్సైల్స్ ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫారిన్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని సమర్థించకూడదని, ప్రపంచమంతా ఏకమై తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వుందని బహ్రెయిన్ పేర్కొంది. అత్యంత చాకచక్యంగా మిస్సైల్స్ని డిస్ట్రాయ్ చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ అభినందించింది. సౌదీ అరేబియాకి బహ్రెయిన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనీ, ఇస్లామిక్ సమాజం అంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. తైఫ్ మీదుగా వస్తున్న మిస్సైల్స్ని సౌదీ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. మిస్సైల్ శకలాలు వాడి జలీల్లో కూలిపోయాయి. కాగా, యెమనీ ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని ఖండించింది. పవిత్ర నగరాలపై దాడులకు దిగడం ద్వారా తీవ్రవాదులు తమ హీనత్వాన్ని చాటుకున్నారని యెమెన్ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్