హవాలా కేసులో ఇండియన్ ప్రిన్సిపల్ అరెస్ట్
- May 24, 2019కువైట్: హవాలా కుంభకోణానికి సంబంధించి ఇండియాలో ఓ ముస్లిం క్లరిక్ మరియు బిజినెస్ మేన్ని అరెస్ట్ చేశారు. 8,45,000 రూపాయల్ని కువైట్ నుంచి పంపినట్లుగా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. బార్పేటలోని జామియా ఇస్లామియా సలాఫియా అరబిక్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు నురుల్ ఇస్లామ్. అతని నుంచి డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తనకు ఆ సొమ్ము కువైట్ నుంచి వచ్చినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసులో బిజినెస్ మేన్ ఆరోన్ సార్ఫ్ని కూడా అరెస్ట్ చేశారు. హవాలా డీల్కి అరోన్ సహాయ సహకారాలు అందిస్తారు. నురుల్ ఇస్లామ్ గతంలో 28,00,000 రూపాయల్ని యూనివర్సిటీ బ్యాంకింగ్ అకౌంట్లో మూడు సెపరేట్ ట్రాన్సాక్షన్స్ రూపంలో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అనైతిక కార్యకలాపాల కోసం నిందితుడు ఈ డబ్బుని వినియోగించి వుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండర్గ్రౌండ్ నెట్వర్క్ ద్వారా హవాలా సిస్టమ్ నడుస్తుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..