కోలకతాలో డెలివరీ బాయ్ ఔదార్యం
- May 24, 2019
కోలకతా:అన్నా ఆకలైతుంది. ఓ పది రూపాయలుంటే ఇయ్యవా.. మూడు రోజులైంది అన్నం తిని.. రొట్టె కొనుక్కుని తింటా.. అని చింపిరి జుట్టు, చిరిగిన చొక్కా వేసుకున్న మురికి వాడకు చెందిన ఓ బాలుడు కాళ్లకి అడ్డం పడేసరికి పతిక్రిత్కి జాలేసింది. కానీ ఆ వెంటనే కోపం కూడా వచ్చింది వాడితో మాట్లాడేసరికి. కారణం వాడు డ్రగ్స్కి బానిసయ్యాడని తెలుసుకున్నాడు. అందుకే మరో ఆలోచన లేకుండా వాడి చెంప పగలగొట్టాడు పతిక్రిత్. ఆ పిల్లాడు కన్నీరు మున్నీరై అతడి కథ మొత్తం చెప్పాడు. దాంతో డబ్బులిస్తే మళ్లీ డ్రగ్స్ కొంటాడని కడుపు నిండా అన్నం పెట్టించాడు.
అతడి కళ్లలో ఆనందాన్ని చూసి అప్పుడే నిర్ణయించుకున్నాడు వారి కోసం ఏమైనా చేయాలని. కోలకతాకు చెందిన పతిక్రిత్ మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేసేవాడు. నాలుగేళ్ల కిందట కోల్కతాలోని డుమ్ డుమ్ కంటోన్మెంట్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఓ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ల మీద పడ్డాడు. వాడి ఆకలి తీర్చిన ఆనందం తన ఉద్యోగ రాజీనామాకు దారి తీసింది. జొమాటోలో డెలివరీ బాయ్గా జాయినయ్యాడు. అక్కడ కస్టమర్లు క్యాన్సిల్ చేసిన ఆహారాన్ని మురికి వాడల్లో నివసిస్తున్న బాల బాలికలకు ఇస్తూ వారి కడుపు నింపుతున్నాడు. నాలుగు అక్షరం ముక్కలు నేర్పిస్తున్నాడు. నాలుగు డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని చూపుతున్నాడు.
జన సంచారం ఉన్న ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లలో, బస్టాపుల్లో వాటర్ బాటిల్ స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మధ్య ఓ రెస్టారెంట్ యజమాని పతిక్రిత్కి స్నేహితుడయ్యాడు. అతడితో మాటల మధ్యలో కస్టమర్లకు వడ్డించగా మిగిలిపోయిన ఆహారాన్ని పేద పిల్లలకు అందించమని పతిక్రిత్ అడిగాడు. అందుకు స్నేహితుడు కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. పేద బాలల కడుపు నింపుతున్న పతిక్రిత్ని వారంతా అన్నా, రోల్ కాకు అని ప్రేమగా పిలుచుకుంటున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి