ఇరాన్ను అడ్డుకునేందుకు అరబ్ దేశాలకు ఆయుధ విక్రయాలు
- May 26, 2019వాషింగ్టన్/టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో ఇరాన్ దూకుడును అడ్డుకునేందుకు అరబ్ దేశాలకు 800 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఆయుధ ఎగుమతుల నియంత్రణా చట్టం పరిధిలో 810 కోట్ల డాలర్ల విలువైన ఆయుధసామగ్రి, బాంబులు, క్షిపణులతోపాటు సైనికదళాలను సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లకు పంపుతున్నట్లు ఆయన శనివారం ఇక్కడ తెలిపారు. గల్ఫ్, మధ్యప్రాచ్యంలో ఇరాన్ దుస్సాహసాన్ని అడ్డుకునేందు కు సాధ్యమైనంత త్వరలో ఈ ఆయుధాలను, సైనిక దళాలను అక్కడికి తరలిస్తా మని చెప్పారు.ఈ నిర్ణ యాన్ని వ్యతిరేకించిన డెమొక్రాటిక్ ప్రతినిధి క్రిస్ మర్ఫీ 'ఈ ప్రతిపా దనను అమెరికన్ కాంగ్రెస్ తిరస్కరిస్తుందని తెలిసే అధ్యక్షుడు దొడ్డిదోవను ఎంచుకున్నారని, ఈ బాంబులను వారికి విక్రయించాల్సి నంత అత్యవసర స్థితి ఏమీ లేదని అన్నారు.
మధ్యప్రాచ్యంలోకి వస్తున్న అమెరికా యుద్ధనౌకలపై ప్రయోగించేందుకు తాము అత్యాధునిక ఆయుధాలను సిద్ధం చేస్తున్నామని ఇరాన్సైనికాధికారి జనరల్ మోర్తజా కుర్బానీ చెప్పారు. 'మూర్ఖంగా వ్యవహరిస్తే తాము అమెరికా యుద్ధ నౌకలు, విమానాలను సిబ్బందితోసహా సముద్రంలో ముంచేస్తామని ఆయన హెచ్చరించారు. ఇందుకు తమకు రెండు క్షిపణులు లేదా రెండు రహస్య ఆయుధాలు సరిపోతాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్