భానుడి భగభగలు..భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు
- May 26, 2019ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఈ వేసవిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడు పగిలిపోయేలా ఎండల తీవ్రత ఉంటోంది. ఎండల తీవ్రతకు వేడిగాలులు తోడయ్యాయి. వేడిగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. శనివారం (మే 25,2019) హైదరబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాదాపూర్ లో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. పాశమైలారంలో 43.5, ఖైరతాబాద్ లో 43.2, బేగంపేటలో 42.2, అంబర్ పేట్ లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాదాపూర్ లో ఈ స్థాయిలో ఎండల తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం (మే 26,2019) ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మాడు పగిలే ఎండలు, వడగాలులతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చెయ్యడం లేదు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే రైతులు, కూలీలు వడదెబ్బతో ఆస్పత్రులపాలవుతున్నారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు సాయంత్రం వరకు రోడ్ల మీదకు రాకపోవడమే మంచిదంటున్నారు. బాలింతలు, పిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు