తెలంగాణా ముఖ్యమంత్రి కి సాదర స్వాగతం
- May 26, 2019తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం ఆదివారం సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కి సాదరస్వాగతం లభించింది.
టిటిడి జెఇఓలు లక్ష్మి కాంతం,శ్రీనివాసరాజు,జెసి పి.ఎస్.గిరీషా, తిరుపతి నగర పాలక కమిషనర్ వి.విజయ్ రామరాజు, తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి అన్బు రాజన్ ,తహశీల్దార్ హరికుమార్, రేణిగుంట డీఎస్ పి చంద్రశేఖర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, టర్మినల్ మేనేజర్ లు గోపాల్, శ్యామ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప, శాసనభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయనస్వామి, ఆదిమూలం, నవాజ్ బాషా , రాజకీయ నాయకులు ఎం.ఆర్.సి.రెడ్డి, శంకర్ రెడ్డి,అభినయ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలోవున్నారు.
విమానాశ్రయంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారి ఎం.కె.సింగ్, సిఐ ఎస్ ఎఫ్ అడిషనల్ కమాండెంట్ శుక్లా, రెవెన్యూ అధికారులు ఈశ్వర్ ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు తిరుమల బయలుదేరి వెళ్లారు. రాత్రి బస చేసి సోమవారం ఉదయం శ్రీవారి ని దర్శించుకుని మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగుప్రయానం అవుతారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం