ఇందిరాగాంధీ పాత్రలో అలనాటి అందాల తార
- May 29, 2019ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రవీనాటాండన్ ఇప్పుడు ముఖ్యపాత్రలలో మెరుస్తోంది. 90వ దశకంలో అక్కినేని నటించిన రధసారథిలోనూ, బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రంలోనూ రవీనాటాండన్ కథనాయికగా నటించింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలే చేస్తూ వచ్చిన ఆమె ఇన్నేళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఆ మధ్య కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా కేజీఎఫ్: చాప్టర్-2 చిత్రం తెరకెక్కుతోంది. చాప్టర్-1కు వివిధ భాషల్లో లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్ను నిర్మించే పనిలో చిత్రబృందం ఉంది. కాగా పీరియాడిక్ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన సన్నివేశాలున్నాయట. దాంతో ఆ పాత్రకు రవీనా అయితే న్యాయం చేకూరుస్తుందని, అంతేకాకుండా ఆమె నటించడం వల్ల బాలీవుడ్లో చిత్రాన్ని మార్కెట్ చేయడం కూడా సులువు అవుతుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం