'భారత్' సినిమా రిలీజ్ పై ఉత్కంఠ
- June 03, 2019న్యూఢిల్లీ:బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీ విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తక్షణం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. దేశం పేరుతో రూపొందిన ఈ సినిమా దేశ సాంస్కృతిక, రాజకీయ ప్రతిష్టను మసకబార్చేలా ఉందన్న పిటిషనర్ ఆరోపణలపై విచారణకు హైకోర్టు ముందుకొచ్చింది.
జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తమ పిటిషన్పై సత్వరమే విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల వినతిని జస్టిస్ జేఆర్ మిధా, జస్టిస్ చందర్శేఖర్లతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరిస్తూ దీనిపై ఈరోజే విచారిస్తామని పేర్కొంది. ఎంబ్లమ్స్, నేమ్స్ చట్టం ప్రకారం భారత్ పేరును ఎలాంటి వ్యాపారం, వర్తకం, వృత్తి లేదా ట్రేడ్మార్క్, పేటెంట్లాగా వాడుకోవడం నిషిద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం 'భారత్' దేశ అధికారిక నామమని, ఈ పేరుతో సినిమా టైటిల్ సరైంది కాదని పిటిషనర్ వికాస్ త్యాగి నివేదించారు. సినిమా విడుదలపై మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ