15,000 కిలోల పేపర్ వేస్ట్ని కలెక్ట్ చేసిన 8 ఏళ్ళ చిన్నారి
- June 12, 20198 ఏళ్ళ ఎకో వారియర్, సుమారు 15,000 కిలోల పేపర్ వేస్ట్ని దుబాయ్లో కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ - నేషనల్ వైడ్ రీసైక్లింగ్ క్యాంపెయినింగ్ సందర్భంగా భారతీయ విద్యార్థిని నియా టోనీ ఈ ఘనతను సాధించింది. ఈ క్రమంలో 22వ ఎడిషన్ ఎమిరేట్స్ రీసైక్లింగ్ అవార్డుని కూడా గెల్చుకుంది నియా టోనీ. ఈ క్యాంపెయిన్ ద్వారా ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్, ప్రాజెక్టడ్ కార్బన్ ఎమిషన్స్ని కనీసం 73,393 మెట్రిక్ టన్నుల మేర తగ్గించగలిగింది. కార్పొరేషన్స్, అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇండివిడ్యుయల్స్ / ఫ్యామిలీస్ అనే మూడు కేటగిరీల కింద ఎకో ఫ్రెండ్లీ డ్రైవ్ని నిర్వహించారు. పేపర్, ప్లాస్టిక్, గ్లాస్, క్యాన్స్, మొబైల్స్ అండ్ టోనర్స్ని కలెక్ట్ చేయడం ల్యంగా పెట్టుకున్నారు. టోనీ, పేపర్ సెక్షన్లో ఇండివిడ్యువల్ కేటగిరీలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది. మొత్తం 14,914 కిలోల పేపర్ వేస్ట్ సేకరించిందామె.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్